వనపర్తి జిల్లా కేంద్రంలో మైనార్టీ లకు మినీ హజ్ హౌస్ నిర్మించేందుకు మార్గం సుగమం అయింది. కోటి రూపాయల అంచనా వ్యయంతో జీఓ విడుదల చేశారు.
చాలా కాలంగా మైనారిటీల నుంచి మినీ హజ్ హౌస్ నిర్మించాలనే డిమాండ్ ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేడు నిధులు విడుదల చేయించారు.
మినీ హజ్ హౌస్ తో పాటు వనపర్తి నాలుగు వైపులా 3 ఎకరాల భూమి ముస్లిం మైనారిటీలకు స్మశాన వాటికల కోసం కేటాయించారు.
జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ నిర్వహణ కోసం కూడా స్థల కేటాయింపు చేశారు.
ఈ 3 విషయాల పై చొరవ తీసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వనపర్తి జిల్లా ముస్లింల తరుపున జిల్లా కో ఆప్షన్ మెంబర్ మునీరుద్దీన్, తెరాస జిల్లానాయకులు షేక్ జహంగీర్ ధన్యవాదాలు తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి