38.2 C
Hyderabad
April 25, 2024 14: 43 PM
Slider వరంగల్

బైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

#ambedkar

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పట్టపగలు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని  సమతా సైనిక్ దళ్, నేతకాని సంఘం ఆధ్వర్యంలో ములుగు  జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.

అనంతరం ములుగు జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి నర్సయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని విగ్రహాల దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కమిటీ సభ్యులు  జనగం చిన వీరస్వామి, చెన్నూరి నర్సయ్య,గాంధేర్ల సారయ్య, బండి వీరస్వామి, రామటేంకి చంద్రయ్య, జనగం వెంకన్న, గాంధేర్ల పాపయ్య, గోగు ముత్తయ్య, జనగం సమ్మయ్య, దుర్గం సమ్మయ్య, జనగం లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ ఐదేళ్లూ ఏం పీకావు జగన్ రెడ్డీ?

Satyam NEWS

రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం

Satyam NEWS

వేములవాడ కోడెల మేతకు గడ్డిమోపులు

Satyam NEWS

Leave a Comment