40.2 C
Hyderabad
April 24, 2024 17: 18 PM
Slider హైదరాబాద్

చర్లపల్లి లో కొలువుతీరిన ముత్యాల ముగ్గుల రంగవల్లులు

#cherlapalli

హైదరాబాద్ నగర మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ , చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ ల  ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కప్రా సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్ల వారికి చర్లపల్లి చెరువు  ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి.

పోటిలో విజేతలకి ప్రత్యేక బహుమతులు , పోటీలో  పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా రామ్మోహన్  మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని,సంక్రాంతి  అంటే మనకి గుర్తుకు వచ్చేది హరిదాసులు, గొబ్బెమ్మలు  ముగ్గులు, భోగి మంటలు అని అన్నారు. ప్రతి తెలుగువాడు చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతిని ప్రతి ఇల్లు సంతోషాలతో జరుపుకోవాలని అష్టఐశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

ఆదివారం అత్యంత వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని,ఈ పోటీలలో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని,వారి  ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రకరకాల ముగ్గులు వేశారని తెలిపారు. ముగ్గుల పోటీలులో పాల్గొన్న విజేతలకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజు,థర్డ్ ప్రైజ్ లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు,డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ రామ్మోహన్,శ్రీదేవి లు కృతజ్ఞతలు తెలిపారు.

సత్యంన్యూస్.నెట్, మేడ్చల్ జిల్లా

Related posts

వనపర్తి మునిసిపాలిటిలో అవినీతి ఆధారాలతో నిరూపిస్తా

Satyam NEWS

కాపాడుకో?

Satyam NEWS

ఉద్యోగులకు నిరుద్యోగులకు ఆశాకిరణం రాములు నాయక్

Satyam NEWS

Leave a Comment