సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ముత్యాలమ్మ బోనాల పండుగ జాతర రెండవ రోజు వైభవంగా జరిగింది. వయస్సు ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో జాతర కార్యక్రమంలో పాల్గొని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ జాతర విశిష్టమైనది అన్నారు.
ఆ ముత్యాలమ్మ తల్లి కృపతో కరోనా వైరస్ అతి త్వరగా అంతం కావాలని, నియోజకవర్గ ప్రజలు, రైతులు, కార్మికులు,వ్యాపార రంగాల వారు, చిన్న,పెద్ద అందరూ,అన్ని వర్గాల వారు సుఖ-సంతోషాలతో,పాడి, పంటలతో వృద్ధి చెందారని పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,TRS నాయకులు ముడెం గోపిరెడ్డి, కడియాల రామకృష్ణ, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.