సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలో గురువారం సి ఐ టి యు మండల కమిటీ ఆధ్వర్యంలో మోటారు వాహనాల చట్టం 2019 రద్దు చేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు సయ్యద్ రణమియా మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 2019 మోటారు వాహనాల చట్టం అమలు చేయడం,తద్వారా వసూలు చేస్తున్న అదనపు భారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్ ధరలను,రోడ్ సేఫ్టీ బిల్లు 2019 ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.అశోక్,రవి, వేణు,సుదర్శన్,ఆరాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్