సులువైన వ్యవసాయం కోసం మై ట్రాక్టర్ ఇండియా ఎల్లవేళలా రైతులకు తోడుగా ఉంటుందని ఆంధ్ర తెలంగాణ బిజినెస్ హెడ్ హరికృష్ణా రెడ్డి అన్నారు.
ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామంలో గురువారం ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అమ్మకాల్లో భాగంగా ఎనిమిది మంది రైతులకు ట్రాక్టర్ టైర్ లను అందించారు.
ఈ సందర్భంగా బిజినెస్ హెడ్ హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో పురాతన పద్ధతులను పాటిస్తూ ఆహారధాన్యాలను పెంచే లక్ష్యంతో ఏర్పడిన సంస్థయే మై ట్రాక్టర్ ఇండియా అని అన్నారు.
ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో మై ట్రాక్టర్ ఇండియా ఔట్ లెట్స్ ఏర్పాటు చేసి రైతులకు ఉచిత సర్వీస్ ను అందించనున్నట్లు ఆయన తెలిపారు.
రైతు చేసే వ్యవసాయానికి అండగా మై ట్రాక్టర్ ఇండియా ఎల్లవేళలా తోడు ఉంటుందని ఈ సేవలను రైతులు వినియోగించు కుంటూ ముందుకు సాగుతే సామాజిక జీవనంలో మెరుగైన అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.