మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కరోనా వైరస్కు సంబంధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు గతంలో కూడా కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. అక్రమంగా దిగుమతి చేసుకోవడం, ‘వాకీ-టాకీలు’ కలిగి ఉండటం నేరంపై ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిందని లీగల్ ఆఫీసర్ సమాచారం అందించారు.
గత నెలలో మరో రెండు నేరాలను అంగీకరించడంతో సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. దాని తరువాత దేశ సైనిక ప్రభుత్వ అధిపతి శిక్షను సగానికి తగ్గించడం జరిగింది. గతేడాది ఫిబ్రవరిలో మయన్మార్లోని సూకీ ప్రభుత్వాన్ని సైన్యం మిలటరీ మార్గాల ద్వారా తొలగించి ఆమెను జైలులో పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల్లో సైన్యం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి 76 ఏళ్ల నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై దాదాపు డజను కేసులు దాఖలయ్యాయి. సైనిక చర్యలను చట్టబద్ధం చేయడం, రాజకీయాల్లోకి ఆమె తిరిగి రాకుండా నిరోధించడమే లక్ష్యంగా ఆరోపణలు ఉన్నాయని సూకీ మద్దతుదారులు అంటున్నారు.
మయన్మార్ రాజ్యాంగం ప్రకారం.. జైలు శిక్ష అనుభవిస్తే ఎవరైనా ఉన్నత పదవిని నిర్వహించడం లేదా MP MLA అవ్వడాన్ని నిషేధిస్తుంది. నవంబర్లో మయన్మార్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సూకీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిందని, అయితే ఎన్నికల్లో చాలా వరకు అవకతవకలు జరిగాయని సైన్యం పేర్కొంది.