ఆషాఢ మాసంలో విశేషంగా భక్తులు వచ్చే నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం లోని నాయినోనిపల్లి గ్రామం లో నెలకొని ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ మైసమ్మ దేవత ఆలయాన్ని కరోనా వ్యాప్తి కారణంగా మూసివేశారు. ఈ నెల 12 నుంచి 31వ తేదీ వరకూ ఆలయం మూసి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరారు.
ఆషాఢ మాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం కరోనా క్లిష్ట సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఐ వెల్లడించారు. కరోన వైరస్ ప్రభావం అధికంగా ఉన్నందున భక్తుల శ్రేయస్సును దృష్టి లో ఉంచుకొని దేవస్థానం వారు తేదీ 12.07.2020 ఆదివారం నుండి తేదీ 31.07.2020 వరకు మూసి ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ప్రతి ఒక్కరు పాటిస్తూ మన ప్రాంతంలో కరోన మహమ్మారి విజృంభించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ తెలిపారు.