ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని గాంధీనగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ మైసమ్మతల్లి దేవాలయ పున:నిర్మాణ భూమి పూజ మహో త్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందజేస్తానని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరి నవీన్ గౌడ్, గూడ ఇంద్రయ్య, వేమూరి మహేష్ గౌడ్ మరియు స్థానిక ప్రజలు నాయకులు పాల్గొన్నారు.