ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమం లో భాగంగా కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్ లో ఆదివారం కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో పనులను రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అదనపు గదుల నిర్మాణాలు పాఠశాలల్లో విద్యుత్తు తాగునీరు మరుగుదొడ్లు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఒంటిమిట్టకు జూనియర్ కళాశాల విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే కళాశాలకు కూడా శంకుస్థాపన చేస్తానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు.