తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకులు నాగరాజు యాదవును తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు మౌర్య ఇన్ హోటల్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు యావ్ పార్టీలో చేరారు.
నారా చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృతస్థాయి సమావేశం లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పరిపాలన చేతకాని జగన్మోహన్ రెడ్డి ని ఓడించాలని ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నుంచి కష్టపడి పని చేయాలని కోరారు. ఈ ప్రభుత్వంలో రౌడీలు గుండాలు ప్రజా ప్రతినిధులుగా ఉంటూ భూకబ్జాలు పాల్పడుతున్నారని అన్నారు. ఇక రాష్ట్రంలో భూకబ్జాలు చేయడానికి ప్రభుత్వ ఆస్తులు ఇక లేవు ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా దక్కించుకోవాలని చూస్తున్న ఈ రౌడీలకు తగిన బుద్ధి చెప్పాలి తమ్ముళ్లు అని కార్యకర్తలకు తెలిపారు.