ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. దాంతో ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు గా ఉంది. పూర్తి సామర్ధ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 167.75 టీఎంసీలు ఉన్నాయి.
సాగర్ జలాశయంలోకి 500 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో సమానంగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లూ ఉంచారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే ఈసారి సాగర్ జలాశయానికి వరద తాకిడి గత ఏడాది కంటే ముందుగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే ఈసారి సాగర్ జలాశయంలో 40 టీఎంసీల నీరు అదనంగా ఉంది.