నాగర్ కర్నూల్ పట్టణంలో శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక మహిళ ఈ నెల 27వ తేదీన కిడ్నీకి సంబంధించిన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కరోనా సోకింది. మొదట కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.
అయితే ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆమెకు సంబంధించిన నలుగురు ప్రైమరీ కాంటాక్ట్ ను గుర్తించి హోమ్ క్వారంటైన్ లో ఉంచి వారికి వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతుందని ఆయన తెలిపారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్రీధర్ విజ్ఞప్తి చేస్తూ రోజురోజుకు కారోన కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా మహమ్మారి బారినుండి తమను తాము కాపాడుకోవాలని, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్రీధర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు