శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతూ మార్గ మధ్యలో ఆగిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ కు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి కూడా పాల్గొన్నారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ తో పాటు తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తమ కుటుంబ సమేతంగా ఆదివారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతూ నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ హరిత హోటల్ లో కాసేపు నిడివి చేశారు. ఈ సందర్బంగా మహబూబ్ నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ కె. మనోహర్ తో కలిసి సి.జే.ఐ కి ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనం సి.జే.ఐ స్వీకరించారు. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ జ్ఞాపికను జిల్లా కలెక్టర్ ఇద్దరు సి.జే.ఐ లకు అందజేశారు. కాసేపు నిడివి చేసిన అనంతరం శ్రీశైలం పయనమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి రఘురామ్, మహిళా మరియు పొక్సో జడ్జి ఉమాదేవి, నాగర్ కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి శీతల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రాం, డి.ఎస్పీ గిరిబాబు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్