27.7 C
Hyderabad
April 20, 2024 00: 59 AM
Slider మహబూబ్ నగర్

10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

#deonagarkurnool

10వ తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని నాగర్ కర్నూల్ డీఈఓ గోవిందరాజులు సూచించారు. సోమవారం సాయంత్రం నాగర్ కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూలు, ప్రభుత్వ హైస్కూలును తనిఖీ చేశారు. పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డిఈఓ పరిశీలించారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. నేడు విద్యార్థులకు నిర్వహించిన వార పరీక్షలను పరిశీలించారు. సబ్జెక్టులవారీగా వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షల సమయం 80 రోజులు మాత్రమే మిగిలి ఉందని సమయాన్ని వృధా చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం పొందాలని సూచించారు. డిఈఓ వెంట స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కురుమయ్య సబ్జెక్ట్ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Related posts

సెల్ ఫోన్ వెలుతురులో చంద్రబాబు ప్రసంగం

Satyam NEWS

ఇరకాటంలో కొడాలి నాని….

Satyam NEWS

దూసుకుపోతున్న డర్టీ హరీ చిత్రం.. తొలిరోజే రికార్డు వ్యూస్..

Satyam NEWS

Leave a Comment