28.7 C
Hyderabad
April 25, 2024 03: 55 AM
Slider ఆధ్యాత్మికం

పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప

tirumala-1

నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీమలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, విఎస్వోలు మనోహర్, ప్రభాకర్, ఎస్వీబీసీ సిఈఓ సురేష్ కుమార్, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఇన్ యాక్షన్: తొలి రోజే విధినిర్వహణ లో నిఖిల

Satyam NEWS

కావలి ఎమ్మెల్యేపై ఎస్ సి ఎస్ టి కేసు పెట్టాలి

Bhavani

కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment