విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారాన్ని మేజర్ రామ్ తెలిపారు. వెంగళ్ రావు నగర్ కాలనీ నలంద విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు టాలెంట్ క్రియేటివ్ లాజికల్ మైండ్ సర్టిఫికెట్ లను మేజర్ అందజేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పట్టుదల క్రమశిక్షణతో చదువుతూ తమ లక్ష్యాలను సాధించాలన్నారు.
నలంద విద్యా సంస్థలు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను గుర్తించి క్రియేటివ్ లాజికల్ సర్టిఫికెట్ లను అందజేయాడం గొప్ప విషయం అని అభినందించారు. మిగతా విద్యాసంస్థలకు నలంద ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతరం నలంద విద్యాసంస్థల చైర్మన్ ఎం సూర్య నారాయణ రాజు మాట్లాడుతూ విద్యారంగంలో నలంద ఎప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుట్టుకుంది అని తెలిపారు. తమ సంస్థలో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చారని తెలిపారు.