కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలవుతున్న క్రమంలో అనాధలు, పేద ప్రజలు, యాచకులకు కొందరు నల్లగొండ పోలీస్ కానిస్టేబుల్స్ స్ఫూర్తివంతంగా నిలిస్తూ ఆపన్నహస్తం అందిస్తుండగా పలువురు దాతలు వారికి బాసటగా నిలుస్తున్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఏ.ఆర్. విభాగంలో పని చేస్తున్న హఫీజ్, సైదులు, కరుణాకర్, జగదీష్ లు చేస్తున్న సేవలకు తాజాగా శనివారం రోజున ఆర్.ఐ.లు వై.వి. ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్ లు ఆర్ధిక సహాయం అందించి స్వయంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులు, దాతల సహకారంతో వితరణ కార్యక్రమాలు లాక్ డౌన్ ముగిసే వరకు కొనసాగిస్తామని కానిస్టేబుల్స్ తెలిపారు.