40.2 C
Hyderabad
April 19, 2024 18: 09 PM
Slider గుంటూరు

వినుకొండ ఎమ్మెల్యే బొల్లాకు తీరని ఆవేదన

#bollabrahmanaidu

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు విస్తు గొలిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కొద్ది నెలల క్రితం అనధికారికంగా స్టేడియం నిర్మించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. దానికి తన పేరు పెట్టుకున్నారు. ఉన్నత విద్యా మండలి అనుమతి లేకుండానే నిర్మాణం జరిగింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిన్నటి వరకు బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం పేరుతో ఉన్న స్వాగత ద్వారాన్ని రాత్రికి రాత్రే డా. వైఎస్సార్ స్టేడియంగా పేరు మార్చారు.

ఒక్క పేరు మార్చి సీఎం నోరు నొక్కిన ఎమ్మెల్యే.. అనధికారికం నుంచి అధికారికంలోకి అనధికారిక స్టేడియం.. నిర్మించడంపై ముఖ్యమంత్రి నుంచి మాట రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రాత్రికి రాత్రే వైయస్సార్ స్టేడియంగా పేరు మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టును విచారణ జరుగుతోంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఇటీవల ఎమ్మెల్యే అనుచర రియల్టర్లు రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం మీడియాలో రావడంతో వెనక్కు తగ్గారు.

Related posts

డిసెంబర్ 23న వర్చువల్ సేవా దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Bhavani

ఘనంగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment