నటసింహా, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు ఆయన బర్త్ డే సందర్భంగా గత మూడు రోజుల నుంచి సంబరాలు మొదలు పెట్టారు.
గోశాలలోని గోవులకు సేవాకార్యక్రమం, పేద నందమూరి అభిమానుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ, కొంత ఆర్థిక సహాయంచేయడంతో ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక యిబ్బందులు ఎదుర్కొన్న పేద బ్రాహ్మణులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిజె. వెంకటసుబ్బయ్య, టి. సుధాకర్ యాదవ్, గోమేధికమ్ సుదర్శన్ తదితర నందమూరి అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు.