కర్నూలు జిల్లా ఆదోని పట్టణ నందమూరి వీరాభిమాని, నందమూరి బాలకృష్ణ ఫాన్స్ ప్రెసిడెంట్కె . ఎస్. ఏమోజీ రావు మృతి చెందడం బాలకృష్ణ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, తెలుగుయువత నాయకులు భూపాల్ చౌదరి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద ఎమోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలుగు యువత రాష్ట్ర నాయకులు భూపాల్ చౌదరి మాట్లాడుతూ ఆయన మృతి పార్టీ కి తీరని లోటు అని అన్నారు. ఆయన సేవలు మర్చిపోలేనివి అని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అయన చిత్ర పటానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో బుద్దారెడ్డి నాగరాజు లక్మినారాయణ, నల్లనా బాలాజీ, పట్టణ బాలకృష్ణ అభిమాన సంఘం సజ్జద్, ఓబులేష్, గురు, సీన, నాగార్జున, మహాదేవప్ప, ఈరన్న, రామాంజి, లవ, వీరేష్, ఎన్టీఆర్ సేవాసమితి నాయకులు చాంద్, చక్రి, వెంకటేష్, రాము, వెంకప్ప, బాబులు, తిమ్మప్ప, నందమూరి బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
ఫెస్ బుక్ ద్వారా బాలయ్య సంతాపం
ఎల్లప్పుడూ ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తు, సాటి అభిమానులకి తన తోడ్పాటునందిస్తూ, ఆదర్శప్రాయంగా నిలిచిన ఆదోని పట్టణ అభిమాన సంఘం అధ్యక్షుడు, నా సోదర సమానుడు ఏమోజిరావు పరమపదించడం మాకు అత్యంత బాధాకరం. అయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, అలాగే అయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ….
శోక తప్త హృదయంతో…మీ నందమూరి బాలకృష్ణ