లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఉంటున్న పేద ప్రజలకు సేవ చేసేందుకు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కోనసీమ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు ముదునూరి శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లు పంచుతున్నారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలకు మార్చి 25 నుంచి ప్రతిరోజు 150 మందికి భోజనం ప్యాకెట్లు పంచుతున్నారు. బాలయ్య స్పూర్తితో నందమూరి సేవా సంఘం తరపున ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముదునూరి శ్రీనివాస రాజు తెలిపారు. పేదవారికి సేవ చేయడానికి అమలాపురం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున గర్విస్తున్నామని సంఘ నిర్వాహకులు తెలిపారు.