జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో నేడు తెలంగాణ టీడీపీ నాయకురాలు, నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పాల్గొన్నారు.
సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీర్ పేట్ డివిజన్ లో నేడు ఆమె తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అమీర్ పేట్ డివిజన్ టీడీపీ GHMC కార్పొరేటర్ అభ్యర్థి వరలక్ష్మి ని గెలిపించాల్సిందిగా వారు కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో చేసిన అభివృద్దిని వారు ప్రజలకు గుర్తు చేశారు.
ఈ ప్రచారంలో నందమూరి తారక రామారావు మనవరాలు నందమూరి హరికృష్ణ ముద్దుబిడ్డ తెలంగాణ టీడీపీ కూకట్ పల్లి MLA క్యాండెట్ నందమూరి సుహాసిని,
Ex MLA కాట్రగడ్డ ప్రసూన తో బాటు, సనత్ నగర్ ఇన్చార్జి కసిరెడ్డి శేఖర్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ శ్రీపతి సతీష్ కూడా పాల్గొన్నారు.