27.7 C
Hyderabad
March 29, 2024 03: 34 AM
Slider కృష్ణ

కొల్లు రవీంద్రను కలిసిన నారా లోకేష్

#NaraLokesh

ప్రజల తరపున ప్రభుత్వం పై యుద్ధం చేసేవారిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి జైల్లో పెట్టిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

జైలు నుంచి విడుదల అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను ఆయన నేడు పరామర్శించారు. విజయవాడ కరెన్సీ నగర్ లో ఉన్న కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లిన లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

లోకేష్ తో పాటు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. టిడిపి నేతలపై పెట్టిన తప్పుడు కేసులేవీ మరిచిపోయేది లేదని, వడ్డీ తో సహా చెల్లించి తీరుతామని ఆయన హెచ్చరించారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా రెట్టింపు వేగంతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు రానున్న రోజుల్లోనూ వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది అని లోకేష్ అన్నారు.

Related posts

ఆ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ…!

Satyam NEWS

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

అధ్యక్షా.. ఏదైనా సమస్య ఉంటే ఎవరితో చెప్పాలి?

Satyam NEWS

Leave a Comment