ప్రజల తరపున ప్రభుత్వం పై యుద్ధం చేసేవారిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి జైల్లో పెట్టిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
జైలు నుంచి విడుదల అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను ఆయన నేడు పరామర్శించారు. విజయవాడ కరెన్సీ నగర్ లో ఉన్న కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లిన లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
లోకేష్ తో పాటు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. టిడిపి నేతలపై పెట్టిన తప్పుడు కేసులేవీ మరిచిపోయేది లేదని, వడ్డీ తో సహా చెల్లించి తీరుతామని ఆయన హెచ్చరించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా రెట్టింపు వేగంతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు రానున్న రోజుల్లోనూ వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది అని లోకేష్ అన్నారు.