తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు, డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘనంగా జరిగింది. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీని ముందుగా యువ నేత డాక్టర్ కోడెల శివరాం జెండా ఊపి ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కోడెల కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ప్రముఖ నటుడు నారా రోహిత్ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువ నేత డాక్టర్ కోడెల శివరాం ఓపెన్ టాప్ వెహికల్ లో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీ మందుకు ప్రారంభించారు. వందల సంఖ్యలో కార్యకర్తలు తమ అభిమాన నాయకులకు జేజేలు పలుకుతూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.
previous post
next post