కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం అమ్మవారి దేవాలయంలో ఘనంగా కోటి దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఇస్సపాలెం అమ్మవారి దేవాలయంలో జరిగిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఎంపిపీ మూరబోయిన శ్రీను, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ జల్లి శ్రీనివాస రావు, పుల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, కోటయ్య, రధారపు శ్రీను, వైసీపీ నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్