గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు.
హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, నెగిటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. స్థానిక నేతలు, అధికారులతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.