గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వివేక్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు.
శనివారం కలెక్టరేట్ లో వివేక్ యాదవ్ ను కలసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు.