31.7 C
Hyderabad
April 19, 2024 01: 10 AM
Slider గుంటూరు

ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ బాట లో నడవాలి

#rotaryclub

గాంధీ జయంతి సందర్భంగా శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పెషల్ సబ్ జైల్ ఉన్న 62 మంది ఖైదీలకు బ్రేడ్స్ , ఫ్రూడ్స్ పంపిణీ చేశారు. ముందుగా సబ్ జైల్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 13వ అదనపు జిల్లా జడ్జి ఓ.వి నాగేశ్వరరావు, రెండో కోర్టు జడ్జి జె. అంజయ్య , ప్రభుత్వ వైద్య అధికారి చల్లా వెంకటేశ్వర్లు, సూపర్ డెంట్ యం.వీరయ్య బాబు, రోటరీ క్లబ్ అధ్యక్షులు మెళ్ల చెరువు సుమిత్ర కుమార్, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ యస్ కె.జిలానిమాలిక్, పాస్ట్ ప్రెసిడెంట్ లీలా లావణ్య ,హెడ్ వార్డెన్లు ఏ. సూర్య ప్రకాష్, కె.శ్రీనివాసరావు,వార్డెన్ యం. రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీ బాట లో నడుచుకొనే విధంగా ప్రయత్నాలు చెయ్యాలని, అలాగే జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సమాజంలో నివసించే ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడచుకోవాలని, పొలం గట్ల దగ్గర, పొలాలకు నీళ్లు వేసే మడవలు దగ్గర, పొలం బాట్ల దగ్గర, పొలం ఫైర్లు దగ్గర, పొలం ఎగువ ఉన్న వారికి, పొలం దిగువ ఉన్న వారికి నీళ్ల సమస్య దగ్గర,గృహాలు నిర్మిస్తున్న సమయంలో ప్రహరీ గోడలు దగ్గర, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది గొడవలకు క్షానిక ఆవేశానికి గురై తగాదాలు పెట్టుకోవడం జరుగుతుందని, క్షణిక ఆవేశంతో చేసే తప్పులకు జీవితాలు అల్లకల్లోలం అవుతాయని పేర్కొన్నారు. జైలు నుండి బయటకు వచ్చినా వారు పగలు ప్రతి కరాలతో జీవితాన్ని అంద కారం చేసుకోకుండా తమ తమ జీవితాలను మార్చుకోవాలని సూచించారు. అనంతరం సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలకు వక్తలు బహుమతులు అందజేశారు.

Related posts

త్రేతేశ్వరాయనమహ: మాతృ హత్యాపాతకం నుంచి విముక్తి కలిగించిన హత్యరాల

Satyam NEWS

అభివృద్ధిలో మోడల్ గా రఘునాథపాలెం

Satyam NEWS

పి వి నరసింహారావు ‘కాలాతీతుడు’ కవిమిత్రులకు ఘన సత్కారం

Satyam NEWS

Leave a Comment