కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి బాసటగా నిలిచేందుకు నారాయణ విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం ప్రకటించాయి. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ కే.పునీత్ నేడు కోటి రూపాయల చెక్కును రాష్ట్ర ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు అందచేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోటి రూపాయల విరాళాన్ని మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేస్తారు. కరోనా పై జరుపుతున్న పోరాటంలో తమ వంతు విరాళం ఇచ్చిన నారాయణ విద్యాసంస్థలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
previous post