దేశంలో రెండో సారి కూడా అధికారంలోకి వచ్చి దేశ సేవకు పునరంకితమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని బి.జె.పి పార్టీ కార్యవర్గ సభ్యులు జల్లెపల్లి వెంకటేశ్వర్లు (JVR) అన్నారు. దేశానికి నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన పాలనాదక్షుడు నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లోని హుజూర్ నగర్ బిజెపి కార్యాలయంలో శనివారం బూత్ కమిటీల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. నరేంద్ర మోడి రెండో సారి అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను అందరికి తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు.
మోడీ చేసిన కార్యక్రమాల కరపత్రాలను ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్తకి చేరేలా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కోటిరెడ్డి, ఉమామహేశ్వరావు, గుండగోపి, వీరన్న గౌడ్, కంటూ నాగరాజు, జగన్, ధానాల ప్రసాద్, నాగందచారి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.