కరోనా వైరస్ సోకడంతో ప్రధాని నరేంద్ర మోడీ చిన్నమ్మ నేడు అహ్మదాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు.
ప్రధాని నరేంద్ర మోడీ తండ్రి దామోదర్ దాస్ సోదరుడు జగ్జీవన్ దాస్ భార్య అయిన నర్మదా బెన్ మోడీ కరోనా కు గురయ్యారు.
ఆమెను అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. పది రోజుల పాటు వైద్యులు ఆమెకు చికిత్స అందచేశారు.
అయితే ఆమె నేడు తుది శ్వాస తీసుకున్నారని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ తెలిపారు.