నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు చెందిన మహిళా వ్యోమగామి క్రిస్టినా కాచ్ అంతరిక్షం నుండి తిరిగి భూమిపైకి వచ్చారు. నాసాకు చెందిన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 328 రోజులపాటు గడిపిన క్రిస్టినా సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. అంతరిక్షం నుండి నేరుగా ఆమె కజికిస్తాన్లో దిగారు.
40 సంత్సరాల క్రిస్టినా గత ఏడాది మార్చి లో అంతరిక్షానికి వెళ్లి ౩౦౦ రోజులకు పైగా అంతరిక్షం లో ఉన్న మొదటి మహిళా వ్యోమోగామీ గా రికార్డు సృష్టించారు.అంతరిక్షం లో వివిధ పరిశోధనలు,ప్రయోగాలు చేసి నివేదికలు తయారుచేసిన క్రిస్టినా కాచ్ అంతరిక్షం లోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందన్నారు.