జులై 3న తలపెట్టిన దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సిఐటియు,ఐ ఎన్ టి యు సి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్ణయించింది.
ఆ రోజు కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై మండల తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇలాంటి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు, కే వెంకన్న,జె సైదులు, వెంకటేశ్వర్లు,రామయ్య, శీను, అప్పయ్య తదిరులు పాల్గొన్నారు.