ఇటీవల పుడమి సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు దక్కించుకున్న జనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ను శనివారం నాడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాల వేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన యురేనియం తవ్వకాల కు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటాలకు తనకు అవార్డు దక్కిందని ఆయన అన్నారు. వీటి వెనుక కార్యకర్తల అండదండలు ఎంతో కీలకమని ఆయన అన్నారు.
రాష్ట్రం లో కరోనా వైరస్ విజృంభించి ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు ను ముఖ్యమంత్రి చేసేందుకు వాస్తు పేరుతో సచివాలయంలో కూల్చివేసి 500 కోట్లతో నూతన సచివాలయం నిర్మించడం దారుణమని మండిపడ్డారు.
కరోనా వైరస్ నియంత్రణపై వివిధ సంస్థల నుండి వచ్చిన విధానాలను వైద్య ఖర్చులకు వెచ్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అండదండలు కార్యకర్తల సహకారంతో జిల్లాలో ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించామని అన్నారు.
యురేనియం తవ్వకాలపై కార్యకర్తలు నాయకులు ప్రజలతో మమేకమై పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో పలు గ్రామాలలో ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్ రెడ్డి రాజేష్ రాజేందర్ బాబా సాయి సూర్య జానీ కురుమయ్య శ్రీరామ్ రమేష్ అన్వేష్ రెడ్డి శివ లింగo నాయక్ మహేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.