27.7 C
Hyderabad
March 29, 2024 01: 26 AM
Slider విజయనగరం

విజయనగరం లో కొనసాగుతున్న బంద్..!

#National Bundh

దేశ వ్యాప్తంగా అటు వామపక్షాలు, ఇటు కాంగ్రెస్ ఇచ్చిన బంద్ మూలంగా ఉత్తరాంధ్ర లోని అందున విజయనగరం జిల్లాలో పొద్దునుంచీ ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది.

తెల్లవారుజామున పోలీసులు.. పలు ముఖ్య కూడళ్ల వద్ద ఎలాంటి అవాంతరాలు కలగకుండా బందోబస్తు కు దిగారు.

ఈ మేరకు జిల్లా కేంద్రంలో నగర డీఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో పోలీసులు… ఆర్టీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు.

దీనికి తోడు ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా బందోబస్తు లో ఉన్నారు. పొద్దున్నే వామపక్ష నేతలంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహనాలను అడ్డుకున్నారు.

వెంటనే ఎస్ఐ దేవీ తన సిబ్బంది తో రంగంలో కి దిగారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్ష పార్టీకి తోడైంది.

దీంతో మూకమ్మడిగా కాంప్లెక్స్ వద్ద రోడ్డు పైనే భైఠాయించి.. సంపూర్ణంగా బంద్ కొనసాగేలా వ్యవహరించారు.

Related posts

హిట్ గాడ్: శ్రీవారి సేవలోజాను చిత్ర యూనిట్

Satyam NEWS

ఇకనైనా పాజిటీవ్ గా ఆలోచించాలి జగన్

Satyam NEWS

కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ రవి గుప్తా?

Murali Krishna

Leave a Comment