ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని రాగుగూడా, గేరిజాం ల మీదుగా ముక్ర వరకూ నిర్మించే జాతీయ రహదారి 44 కు నేడు రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రడ్డి భూమి పూజ చేశారు.
వెనుకబడిన ప్రాంతంలో నిర్మించే ఈ రహదారి వల్ల ఎంతో మేలుకలుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా అక్కడ చెక్ డ్యాంను కూడా ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో బాటు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.