1st NTPC నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన స్టీఫెన్ రవీంద్ర సబ్ జూనియర్ విభాగంలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ ప్రమోద్ చందుర్కార్, తెలంగాణ అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కామినేని, కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ చార్జి ప్రెసిడెంట్ వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ చార్జి ప్రెసిడెంట్ వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
previous post