శ్రీకాకుళం స్థానిక 80 ఫీట్ రోడ్లో ఉన్న గీతం డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. రమేష్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల డైరెక్టర్ ఆర్. శ్రీధర్ హాజరై సర్ సి. వి. రామన్ చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవారుచుకుని దేశ పురోగతికి తోడ్పడాలని హితవు పలికారు. ఈ సందర్బంగా కళాశాల సైన్స్ విద్యార్థులు సైన్స్ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బెస్ట్ ప్రాజెక్ట్స్ ని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
previous post