సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రకాశం దర్శిలో 2k రన్ ను ర్వహించారు. పొదిలి రోడ్డులోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వరకు జరిగిన ఈ రన్ ను జెడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి ఎంకయమ్మ, ఎంపీడీవో కే కుసుమ కుమారి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు ఈ 2k రన్ లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2k రన్ లో జోహర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
previous post