27.7 C
Hyderabad
April 24, 2024 10: 57 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

#TirumalaBalajee

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు శుక్ర‌‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉద‌యం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అనంత‌రం బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌ట్టారు.

ఆ త‌రువాత ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అర్చ‌కులు కంక‌ణ‌ధార‌ణ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, పార్ల‌మెంటు స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి,

బోర్డు స‌భ్యులు డిపి.అనంత‌, వేమిరెడ్డి ప్ర‌శాంతి, ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన వేణుగోపాల దీక్షితులు, కంక‌ణ‌భ‌ట్టార్ రామ‌కృష్ణ దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, విజిఓ మ‌నోహ‌ర్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

Related posts

పిసిసి అధ్యక్షుడు రేవంత్ పై సీనియర్ల అసత్య ప్రచారం

Satyam NEWS

కుంభకోణం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలి

Satyam NEWS

ఘనంగా తెలుగుదేశం అధ్యక్షుడు రమణ జన్మదిన వేడుక

Satyam NEWS

Leave a Comment