తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏపిలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం అని మీడియా కు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, పట్టాభి ఇంటి పై వందలాది మంది రౌడీలు గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
పోలీసు శాఖ, డిజిపి వైఫల్యం, నిఘా వైఫల్యం వల్లే ఇటువంటివి జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటివి ప్రోత్సహిస్తే ప్రజల్లో భయాందోళనకు జగన్మోహన్ రెడ్డి కారణం అవుతారని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.