30.7 C
Hyderabad
April 24, 2024 01: 04 AM
Slider గుంటూరు

నవతరంపార్టీ “నేనున్నా మీ కోసం”కరపత్రాలు ఆవిష్కరణ

#navataramparty

ప్రజా సమస్యలపై స్పందించే విషయంలో నవతరంపార్టీ ముందు ఉంటుంది అని,ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకే “నేనున్నా మీకోసం”కార్యక్రమం చేపట్టినట్లు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరు జిల్లా నవతరంపార్టీ అధ్యక్షుడు వెల్లాల సాయి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో డిసెంబరు ఒకటిన “నేనున్నా మీకోసం”కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అమరావతి కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం పోస్టర్లు రావుసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. అన్నీ జిల్లాల్లో నేనున్నా మీకోసం కార్యక్రమం నిర్వహిస్తామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో నవతరంపార్టీ అధికార ప్రతినిధి గట్టినేని శివన్నారాయణ,గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్,గుంటూరు జిల్లా యువత నాయకులు ఉప్పుతల శివశంకర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రూ.3 కోట్లతో గ్రానైట్ టైల్స్ ఫుట్ పాత్ రోడ్డు పనులు

Satyam NEWS

సరిగ్గా చూడండి ఈ ఎద్దుల బండిపై ఏమి ఉన్నాయి?

Satyam NEWS

సెరిమోనియల్ పరేడ్ లో భావోద్వేగానికి గురైన డీఐజీ రాజ‌కుమారీ….!

Satyam NEWS

Leave a Comment