500 రోజులు కు అమరావతి ఉద్యమం చేరుకుంటున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణంగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సోమవారం ఒక ప్రకటన లో విమర్శించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా అయితే రాజధాని అమరావతి ప్రాంతాన్ని వణికిస్తున్న వైరస్ జగన్మోహన్ రెడ్డి అనిపించేలా జగన్ వ్యవహారం ఉందని ఆయన అన్నారు.
ఇప్పటికయినా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి రాజధానిగా అమరావతినే కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
అమరావతి రైతులకు అండగా ఉంటామని తెలిపారు.