నయనతార నటించిన సస్పెన్స్ హారర్ త్రిల్లర్ తమిళ చిత్రం వసంత కాలం. అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి ముఖ్య పాత్రలు పోషించారు.
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు. నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై గతంలో ‘ఏకవీర, వెంటాడు-వేటాడు” వంటి భారీ చిత్రాలు అందించామని చెప్పారు.
నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం ‘వసంతకాలం’ను నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. భూమిక, ప్రతాప్ పోతన్ తదితరుల పాత్రలు ‘వసంతకాలం’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.సస్పెన్స్ హారర్ త్రిల్లర్ గా రూపొంది సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధించి నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతుందనే నమ్మకముందని అన్నారు.