సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ లో మంగళవారం నాయి బ్రాహ్మణ షాపు యజమానులతో సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
సూర్యాపేట జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి శిల్పా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో బెజవాడ కనకయ్య, లక్ష్మీనారాయణ, పిల్లుట్ల కృష్ణ ఆధ్వర్యంలో ఓటింగ్ ద్వారా జరిగిన ఎన్నికలో మిడసనమెట్ల సైదులు ఎన్నికైనారు.
ఈ కార్యక్రమంలో రాయంచు వెంకటేశ్వర్లు,సిహెచ్.సతీష్,ఎస్.ఉపేందర్ చంద్రశేఖర్,ఆవులపాటి శ్రీను,కొంగరి హనుమంతు,శిల్పా సుధాకర్,కంచర కుంట్ల రవి,కార్తీక్,నరేందర్,తదితరులు పాల్గొన్నారు.అనంతరం ముఖ్య అతిధిని ఘనంగా సన్మానించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్