2021 జాతీయ ప్రవేశపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, తమ ప్రతిభాపాటవాలను పరీక్షించుకొనేందుకు నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు.
కరోనా ప్రభావం నేపథ్యంలో ఇంటికి వద్దే డెస్క్ టాప్, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షలు రాసుకొనే విధంగా తీర్చిద్దామన్నారు.
అపరిమితమైన మోక్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, గ్రాండ్ టెస్ట్స్ ను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశామన్నారు. నామ మాత్ర రుసుముతో పరీక్షలు ప్రారంభం అయ్యేవరకు రాసుకోవచ్చన్నారు.
పరీక్షలు రాసిన అనంతరం అల్ ఇండియా ర్యాంక్ కూడా పొందవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.iitjeeforum.com. www.iitwhatsapp.com వెబ్ సైట్ లాగిన్ కావాలన్నారు.