నెల్లూరు లోని విశ్వభారతి అంధుల పాఠశాలకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సతీమణి ఆదాల వింధ్యావళి లక్ష రూపాయల విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి తన మిత్రబృందంతో కలిసి వింధ్యావళి తరఫున అంధుల పాఠశాల కరస్పాండెంట్ కు లక్ష రూపాయల నగదును శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ అంధుల పాఠశాలలోని విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఆదాల వింధ్యావళమ్మ లక్ష రూపాయల మొత్తాన్ని పంపారని తెలిపారు. అలాగే ఆదాల కుటుంబం కూడా చల్లగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, అబూబకర్, ఇక్బాల్, విజయ డైరీ డైరెక్టర్ సునీల్ రెడ్డి, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ గతంలో ఎన్నో సార్లు విరాళాలు అందజేసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే వారి సహకారం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.