చెంచు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు చేపల వలలను నేడు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. మంగళవారంనాడు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరగిరి గ్రామానికి చెందిన 61 మంది చెంచు మత్స్యకారులకు 12 లక్షల 20 వేల విలువైన వలలను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా మత్స్యశాఖ ఎడి మైపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు వదులుతుందని, మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి కుటుంబాలు అభివృద్ధి కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జి. నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ కాటం జంబులయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిషన్ నాయక్, మండల నాయకులు ముచ్చర్ల రాం చందర్ యాదవ్, శేఖర్ శెట్టి, కృష్ణ మూర్తి, అమరగిరి సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.