గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా చర్యలు చేపట్టింది. కేంద్రం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ చేసే ఆకాశం లేకుండా ప్రతి గ్రామ పంచాయితీ కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచుల పేరిట జాయింట్ అకౌంట్ లో ఓపెన్ కాబోతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఫండ్స్ కేటాయిస్తుంది. గ్రామంలోని ప్రతి వ్యక్తికి రూ. 1760 రూపాయల చొప్పున ఎంత జనాభా ఉంటే అంత మొత్తం నిధులు ఇస్తుంది. అయితే ఆ నిధులను గ్రామ అవసరాలకు వాడకుండా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేస్తుంది. ఇతర అవసరాల కోసం ఆ ఫండ్స్ వాడుతూ సర్పంచులకు చుక్కలు చూపిస్తోంది. గ్రామ పంచాయితీ ఖాతాలో ఫండ్స్ ఉన్న ట్రెజరీ సబ్ ట్రెజరీ ఆఫీసు లో ఈ చెక్కులను పేమెంట్ చేయకుండా నిలిపివేస్తారనే ఆరోపణలు వున్నాయి. అప్పుడు ఇప్పుడు అంటూ పనులు చేసిన కాంట్రాక్టర్లను చెప్పులు అరిగేలా తిప్పుకునే వారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడం తో ఈ పరిస్థితి ఉండేది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం వల్ల గ్రామాల్లో పనులు జరిగిన వెంటనే బిల్లు పొందే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర సర్కారు తీరు కారణంగా ఫండ్స్ ఉన్నా ఇన్నాళ్లు సర్పంచులు, తిప్పలు పడాల్సి వచ్చింది ఇకపై ఆ కష్టాలు తీరే అవకాశం వున్నది.